శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘కుబేరా’ . ఈ శుక్రవారానికి థియేటర్లలో విడుదల కానుంది. అన్ని రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పటివరకు టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఎందుకంటే?
బుకింగ్స్ ఆలస్యం కారణం — టికెట్ రేట్ల పెంపు అనుమతి కోసం వేచి
‘కుబేరా’ టీమ్ ఇప్పటికే రూ. 50 టికెట్ రేటు పెంపు కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంబంధిత జీఓ (Government Order) ఇంకా రాలేదు. అది వచ్చిన వెంటనే బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే ట్రెండ్ ఇటీవల చాలా మీడియం బడ్జెట్ సినిమాల విషయంలో కనిపిస్తోంది.
తెలంగాణలో నార్మల్ రేట్లు సరిపోతున్నా, ఆంధ్రలో ఎక్కువే కావాలి!
తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతోనే సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కువ టికెట్ రేట్లు లేకుండా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే అన్న భావనతో ఎక్కువ శాతం సినిమాలు జీఓ కోసం వేచి చూస్తున్నాయి. అందుకే ‘కుబేరా’ బుకింగ్స్ ఇంకా డిలే అవుతున్నాయి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సినిమా పరిశ్రమ ప్రముఖులకు ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో సమావేశమై టికెట్ రేట్లు, సినిమా సమస్యలపై చర్చించమని సూచించినా, ఇప్పటికీ ఆ మీటింగ్ జరగలేదు.
ఇక జీఓ రాగానే బుకింగ్స్ ఓపెన్… ‘కుబేరా’ పైనే అన్ని కళ్లూ!